వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌పైనే గురి, బొత్స ఉల్లం ఝల్లని పొంగె

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ సందర్సన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అమితానందాన్ని కలిగించిందని అంటున్నారు. తనకు సహకరించడం లేదంటూ బొత్స సత్యనారాయణపై గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారట. దాంతో తనపై పిడుగు పడుతుందేమోనని బొత్స ఆదుర్దా చెందుతుండగా, అందరి లక్ష్యం ముఖ్యమంత్రి కావడంతో బొత్స ఊరట చెందినట్లు భావిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ దగ్గర్నుంచీ, ఏకపక్ష వ్యవహారం దాకా అంతా ముఖ్యమంత్రిపైనే విమర్శలు చెలరేగాయి.

ముఖ్యమంత్రి పనికి రారంటూ ఏకంగా కొంత మంది నాయకులు బహిరంగంగానే నిప్పులు చెరిగారు. వారికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రికి తగిన మందీమార్బలం లేదని, ముఖ్యమంత్రి వర్గమంటూ ఏదీ లేకుండా పోయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం వల్లనే, సీనియర్ మంత్రులను కూడా సంప్రదించకుండానే రాజీవ్ యువకిరణాలు వంటి పథకాలను ప్రవేశపెడుతుండడం వల్ల ఆయన సపోర్టు చేసే మంత్రులు కూడా లేకుండా పోయారు. ఇదంతా చాపను చుట్టేసి ఉల్లా వేసినట్లయిందని కిరణ్ కుమార్ రెడ్డి నొచ్చుకుంటున్నారని వినికిడి.

English summary
It is said that PCC president Botsa Satyanarayana is very happy with the developments within the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X