రాష్ట్రపతితో కిరణ్ అర్ధరాత్రి చర్చల మర్మమేంటి

సోమవారం ఢిల్లీ వెళ్లిన కిరణ్కు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రధాని అపాయింటుమెంట్ దొరికింది. దీంతో కిరణ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత గ్యాస్ సమస్యను వివరించేందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు ఆంటోనీ, వీరప్ప మొయిలీలను కలిశారు.
ప్రధానిని కలిసి గ్యాస్ను రాష్ట్రానికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి భవన్కు వెళ్లారట. తన వెంట సెక్యూరిటీ అధికారులను కూడా తీసుకు వెళ్లకుండానే కిరణ్ వెళ్లారట. ప్రణబ్ దాదాతో దాదాపు గంటన్నర పాటు ఆయన చర్చలు జరిపారని సమాచారం. అర్ధరాత్రి పూట భద్రతా అధికారులు కూడా లేకుండా కిరణ్ ఒక్కరే రహస్యంగా వెళ్లి చర్చలు జరపడం వెనుక కారణాలేమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.
ప్రణబ్తో కిరణ్ రహస్య చర్చలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెసులో కూడా వీటిపై జోరుగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రణబ్ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చిన కిరణ్ అప్పుడే ఆయన అపాయింటుమెంటు కోరారని తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి ప్రణబ్తో చర్చల మర్మమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదట.












Click it and Unblock the Notifications