తెలంగాణపై విజయమ్మను ప్రయోగించిన కిరణ్

గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీమాంధ్ర జిల్లాల్లో సాధారణ ప్రతిపక్ష కార్యకర్తలు అడ్డుకోవడం మినహాయించి అంతా ప్రశాంతంగా జరిగింది. అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నం. వరంగల్ జిల్లాలో ప్రతిపక్షాలతో పాటు తెలంగాణవాదులు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కార్యక్రమం అర్ధాంతరంగానే ముగిసిందని చెప్పవచ్చు.
ఇప్పుడు ఆయన తాజాగా ఇందిర బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కిరణ్ భావిస్తున్నారు. అయితే తనకు రచ్చబండ కార్యక్రమంలో ఎదురైన పరాభవం ఇందిర బాటలో పునరావృతం కాకూడదన్న గట్టి భావనతో ఆయన ఉన్నారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కిరణ్ చేశారట. అయితే అంతలో వైయస్ విజయమ్మ చేనేత దీక్ష తలపెట్టడంతో కిరణ్కు పరిస్థితి తెలిసే అవకాశం లభించిందని, దీంతో అతను భారీ బలగాలతో ఆమె దీక్షకు అనుమతించారని, తద్వారా తెలంగాణలో పర్యటిస్తే ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం దొరికిందని చెబుతున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications