Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయశాంతి మాటలు బిజెపి విని ఉంటే..

Vijayashanthi
తెలంగాణలోని ఏకైక శాసనసభా నియోజకవర్గం పరకాలలో పోటీ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మాటలను విని ఉంటే బిజెపి పరువు దక్కి ఉండేదనే మాట వినిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో తెరాసను ఓడించి ఊపు మీద ఉన్న బిజెపి పరకాలలో అదే ఫలితం సాధిస్తామనే ధీమాతో పోటీకి దిగింది. అయితే, బిజెపి అసలు బలమెంతో పరకాల ఉప ఎన్నికలో తేలిపోయింది.

మహబూబ్‌నగర్ వేరు, పరకాల వేరు అని, పరకాలలో బిజెపి పోటీకి దిగడం సరి కాదని విజయశాంతి ఎన్నికలకు ముందు చెప్పారు. పోటీ నుంచి విరమించుకుంటే బిజెపి పరువుకు దక్కుతుందని కూడా ఆమె చెప్పారు. అయితే, విజయశాంతి మాటలను బిజెపి రాష్ట్ర నాయకులు పెడచెవిన పెట్టారు. పోటీకి దిగి, గెలిచి తీరుతామనే ప్రకటనలు చేశారు. తెరాసను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు.

పరకాల ఓటమి తీరుతో తెలంగాణవాదం బిజెపికి కలిసి రాదనే విషయాన్ని నిరూపించుకున్నట్లు అయింది. ఇక, తెరాసకు, తెలంగాణ జెఎసికి ఎదురు తిరిగి ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి బిజెపి ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని పరకాల ఫలితం కల్పించింది. పరకాలలో కనీసం తెరాసకు బిజెపి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలువగా, తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. మూడు స్థానాల్లో బిజెపి ఎక్కడా లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌లో తమకు తెలంగాణ ఓటే పడిందని చెప్పుకోవడానికి కూడా బిజెపికి పరకాల ఫలితం వీలు లేకుండా చేసింది. ఇది బిజెపి స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+