వారిద్దరి తోకలు కత్తిరించిన కిరణ్ కుమార్ రెడ్డి

డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖను రెండు చీల్చేశారు. వైద్య విద్య, 104, 108 సర్వీసుల శాఖలను కొత్తగా మంత్రి పదవి చేపట్టిన కొండ్రు మురళికి కేటాయించారు. ఈ శాఖలకు సంబంధించి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రితో విభేదిస్తూ వస్తున్నారు. ఆ తలనొప్పిని తొలగించుకోవడానికి తన మాట వినే కొండ్రు మురళికి అప్పగించారు. అలాగే, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా చెక్ పెట్టారు. పి. శంకరరావు సబితా ఇంద్రారెడ్డి విషయంలో తనపై చేస్తున్న విమర్శలకు విరుగుడుగానే ఇది జరిగింది. ప్రసాద్ కుమార్ పి. శంకరరావు కుటుంబానికి బంధువు కావడం కూడా అందుకు ఉపయోగపడుతుంది. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి చాతుర్యాన్నే ప్రదర్శించారని చెప్పాలి.












Click it and Unblock the Notifications