సమైక్య 'విభజన': అశోక్ బాబు టార్గెట్ వైయస్ జగన్?

ఏపీఎన్జీవోను చీల్చేందుకు కొంతమంది విభజనవాదులు కుట్ర పన్నుతున్నారని అశోక్ బాబు పరోక్షంగా జగన్ను విమర్శించారు.. బుధవారం శ్రీకాకుళం ఎన్జీవో హోంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ద్వారా ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎవ్వరైనా ఉద్యమం ఆగబోదని ఆయన అన్నారు.
ఏపీఎన్జీవోల ఐక్యత, పోరాటం రాజకీయ పక్షాల్లో దడ పుట్టించిందన్నారు. సమైక్య ఉద్యమాన్ని 85 శాతం విజయవంతం చేశామని, మిగిలిన 15 శాతం రాజకీయ పక్షాలు ఉద్యమంలో భాగస్వాములు కాలేకపోవడంతో విజయవంతం చేయలేకపోయామని అన్నారు.
అశోక్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయం కల్పించడానికి వైయస్సార్ కాంగ్రెసు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న అశోక్ బాబును దెబ్బ తీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అశోక్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన అఖిల పక్ష సమావేశాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బహిష్కరించింది.












Click it and Unblock the Notifications