వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదో దాగి ఉంది - కెవిపి చక్రం వెనుక!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువుగా ముద్రపడిన కెవిపి రామచంద్ర రావు గత కొద్దిరోజులుగా బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా ఆయన సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరినీ ఏకత్రాటి పైకి తీసుకు వచ్చి ఢిల్లీ పెద్దలను కలుస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ఈ నెల 28వ తేదిలోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందన్నప్రచారం నేపథ్యంలో ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేందుకు సీమాంధ్ర నేతలతో కలిపి ఢిల్లీలో బిజీ అయ్యారు.

అయితే ఎప్పుడు మౌనంగా ఉండి తెర వెనుక పనులు చక్కబెట్టే కెవిపి ఇలా తెర పైకి వచ్చి చక్రం తిప్పడం వెనుక ఏముందనే గుసగుసలు కాంగ్రెసు పార్టీలోనే వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను దగ్గరుండి పెద్దల దగ్గరకు తీసుకెళ్లడంతో పాటు అందరి వద్దా ఆయనే ప్రధాన వక్తగా మారి సమైక్యాంధ్ర గళం విప్పుతున్నారట. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తోనూ సమావేశంలో ఆయన దాదాపు పది నిమిషాలు మాట్లాడారు.

ప్రధాని భేటీతో పాటు ఇతర పెద్దల నేతల భేటీలోనూ ఆయన ప్రధానంగా మాట్లాడారట. కెవిపి కావాలనే సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నారని, దీని వెనుక ఏదో మర్మం దాగుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం ఇప్పటికే తీసుకుందని, ఇప్పుడు పార్టీ పెద్దలతో సమావేశాలు అనవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సీమాంధ్ర నేతలు కలవడం, వారిని కెవిపి లీడ్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.

English summary
It is said that KVP Ramachandra Rao is playing key role in Seemandhra leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X