'త్రిలింగ' తిరకాసు: తెలంగాణకు వాస్తుదోషం!
వేములవాడ, శ్రీశైలం, ద్రాక్షారామం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలతో త్రిలింగ దేశంగా పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అరిష్టం తప్పదని హెచ్చరించారు. భావోద్వేగాల పరంగానే కాకుండా వాస్తుపరంగా కూడా రాష్ట్ర విభజన సాధ్యం కాదని తేల్చేశారు. భావోద్వేగాల మీద ఆధారపడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఎన్నికల్లో భావోద్వేగాలు కరిగిపోయి ఆ రెండు పార్టీలు కనుమరుగు కావడం ఖాయమన్నారు.
భావోద్వేగాల మాట ఎలా ఉన్నప్పటికీ త్రిలింగ దేశాన్ని విభజిస్తే అరిష్టమని లగడపాటి వ్యాఖ్యానించడంపై సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటున్నారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసే ఉందా? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. విభజనపై వాస్తు బాట పట్టిన లగడపాటి రాజగోపాల్ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే ఇన్నాళ్లూ సమైక్య సెంటిమెంట్ ఉందని చెబుతూ వస్తున్న లగడపాటి కొత్తగా వాస్తు దోషాన్ని తెర పైకి తేవడం విశేషం.