నిత్యానంద రక్త బీజాసురడట, పుట్టుకొస్తారట!
బెంగళూరు: రాసలీలల కేసు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. బిడది ఆశ్రమంలో గురువారం ఓ కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిత్యానంద స్వామి మాట్లాడారు. తనను జైల్లో పెట్టే ధైర్యం ఎవరికీ లేదని కూడా చెప్పుకున్నారు.
నిత్యానంద స్వామి తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. తాను హిందూ అవతార్ పురుషుడినని చెప్పుకున్నారు. కాగా, సినీ నటి రంజితతో రాసలీలలు, ఓ భక్తురాలి పైన అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద నిత్యానంద స్వామీ గత కొన్నేళ్లుగా మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నిత్యానంద ఇటీవల పురుషత్వ పరీక్షలకు హాజరయ్యారు.

నిత్యానంద స్వామి బెంగళూరు శివారులోని బిడది ఆశ్రమాన్ని వదిలి తమిళనాడులోని తిరువణ్ణామలైలోని తన ఆశ్రమ శాఖకు వెళ్లాలనుకుంటున్నట్లుగా వారం రోజుల క్రితం బిడిది ఆశ్రమం ప్రకటన చేసింది. అయితే, ప్రస్తుతం ఆయన బిడిది ఆశ్రమంలోనే ఉంటున్నారు.
తాను వ్యక్తిని కానని, తాను హిందూ ధర్మ పునరుద్ధారకుడినని, అందుకే తనపై దాడి జరుగుతోందని నిత్యానంద చెప్పుకున్నారు. తన శరీరం నుంచి పడే ఒక్కో రక్తం బొట్టు నుమంచి ఒక్కో నిత్యానంద పుట్టుకొస్తాడని అన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications