వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పలకరింపు: కెవిపి రిప్లై, సబ్బం ఘాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan asks Sabbam Hari
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాస్తా మెట్టు దిగినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి జగన్ వేసిన ప్రశ్నకు ఘుటాగా ఎదురు ప్రశ్న వేయగా, కెవిపి రామచందర్ రావు మాత్రం యోగక్షేమాల పలకరింపునకే పరిమితమయ్యారు.

పార్లమెంటు ఆవరణలో సబ్బం హరి ఎదురైనప్పుడు జగన్ నవ్వుతూ ఆయనను పలకరించారు. "అన్నా! నేనేం పాపం చేశాను? నా వల్ల ఏం తప్పు జరిగింది? ఎందుకు నా మీద ఇలా దాడి చేస్తున్నావు? నిన్ను నేనేమన్నా ఎప్పుడైనా అన్నానా?'' అని అడిగారట. దీనిపై సబ్బం హరి ఘాటుగా స్పందించారు. 'నువ్వేం చేశావో నీకు తెలుసు. నన్నడుగుతావేం?' అని ఎదురు ప్రశ్నించారు. 'అది కాదు హరన్నా! నా మాట విను. మనిద్దరం స్నేహితులుగా కొనసాగుదాం!' అని జగన్ సర్ది చెప్పే ధోరణిలో మాట్లాడారట.

అయితే, సబ్బం హరి సర్దుబాటుకు ససేమిరా అన్నారు. "నేను మాటమీద నిలబడే వాడిని. మాట తప్పే వాడిని కాదు. నేనేం చేశానని మీ వాళ్ల ద్వారా నన్ను అవమానించావు?'' అని ప్రశ్నించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. జగన్ పక్కనే ఉన్న మైసూరా రెడ్డి, బాలశౌరి కూడా సబ్బం హరికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని అంటున్నారు.

కెవిపి రామచంద్రరావును కూడా వైయస్ జగన్ పలకరించినట్లు చెబుతున్నారు. గతంలో కెవిపి ఎప్పుడు ఎదురైనా జగన్ ముఖం తిప్పుకొని వెళ్లిపోయే వారు. ఇటీవల మాత్రం ఆయన పార్లమెంట్‌లో కనిపించినప్పుడు ముఖం మీద నవ్వులు పూయించి 'అంకుల్... ఎలా ఉన్నారు?' అని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 'బాగున్నాను అల్లుడూ' అని కెవిపి బదులిచ్చారు.

English summary

 YSR Congress party president YS Jagan has tried to patch up with Congress MP Sabbam hari. But, Hari rejected Jagan's appeal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X