హైదరాబాదీ బిర్యానీకి ఫేమస్: రియాద్లో ఉగ్రవాది హోటల్
హైదరాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని హోటల్ను వేలం వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది రియాద్లో నడుపుతున్న హోటల్పై అందరి దృష్టి పడింది.
రియాద్లోని ఆ రెస్టారెంట్ హైదరాబాద్కు చెందిన రుచికరమైన బిర్యానీకి పేరు మోసింది. ఆ రెస్టారెంట్ ఇటీవల అరెస్టయిన అబూ సుఫియాన్ అలియాస్ అసదుల్లాకు చెందింది. అతన్ని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అరెస్టు చేసి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి రప్పించింది.
రియాద్లోని ఆ హోటల్ అనుమానిత ఉగ్రవాదుల సమావేశానికి కేంద్రంగా ఉంటూ వచ్చిందని అంటున్నారు. దాని పేరు షాయిజ్వాజన్ షాఫ్రాన్ ప్లేవర్. బెంగళూరులో దాడులకు లష్కరే తోయిబా పన్నిన కుట్ర కేసులో ఎన్ఐఎ హైదరాబాద్ అతన్ని ఇటీవల అరెస్టు చేసింది.
అతన్ని ఎన్ఐఎ హైదరాబాదు నుంచి బెంగళూరుకు తరలించి, బుధవారంనాడు కోర్టులో ప్రవేశపెట్టింది. రియాద్లోని హోటల్ సంగతి ఇంకా తేలాల్సే ఉంది.