షాకింగ్: లోదుస్తుల్లో పరీక్షలు రాయించారు
ముజఫర్పూర్: వారు పరీక్షలు రాసేందుకు వచ్చారు. అయితే, వారిని మొదట బట్టలు ఊడదీయమన్నారు. దీంతో చేసేదేమీ లేక లో దుస్తులతోనే వారు పరీక్షలు రాశారు. వీరంతా ఆర్మీలోని క్లార్క్ పోస్టు కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్లో చోటుచేసుకుంది.
సోమవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులను చొక్కాలు, ప్యాంట్లు విప్పిన తర్వాతే అనుమతించారు అధికారులు. కాగా, కేవలం లోదుస్తుల్లో వారితో రాతపరీక్ష రాయించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, బీహార్లో ఏ పరీక్ష అయినా చూచిరాత, మాస్ కాపీయింగ్ అనేది అలవాటుగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, బీహార్లో చూచిరాత, మాస్ కాపీయింగ్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా పరీక్ష నిర్వహించామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పాట్నా హైకోర్టుకు దృష్టికి వెళ్లింది.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, కథనాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుమోటాగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఘటనపై బుధవారం పాట్నా హైకోర్టు విచారణ జరపనుంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications