షాకింగ్: రేప్ నిందితుడి కాళ్లు మొక్కిన మాజీ చీఫ్ జస్టిస్
జోథ్పూర్: అత్యాచార కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడుకి హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఒకరు అందరూ చూస్తుండగా కాళ్లు మొక్కారు. ఆ నిందితుడు ఆశారాం బాపూ. కాళ్లు మొక్కిన వ్యక్తి సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుందర్ నాథ్ భార్గవ.
ఆయన మాజీ గవర్నర్ కూడా. శనివారం జోథ్పూర్ హైకోర్టు వెలుపల ఈ సంఘటన చోటు చేసుకుంది. దుష్ట శక్తులను తరిమికొడతాననే సాకుతో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలను ఆశారాం ఎదుర్కొంటున్నాడు.

రోజువారీ విచారణకు ఆయనను జోథ్పూర్ జైలు నుంచి కోర్టుకు తీసుకు వస్తున్నారు. శనివారం రాజస్థాన్ పోలీసు అధికారులు జైలు నుంచి ఆయనను వ్యానులో కోర్టుకు తీసుకు వచ్చారు. ఆయనను చూసేందుకు కోర్టు వెలుపల వేచి ఉన్న రిటైర్డ్ జడ్జి.. ఆశారాం వ్యాను దిగగానే పాదాలను తాకారు. ఇది వివాదాస్పదం అయింది.
తాను ఓ ప్రయివేటు కార్యక్రమానికి జోథ్పూర్ వచ్చానని, ఆశారాంను కోర్టుకు తీసుకు వస్తున్నారని తెలిసి ఆయన దర్శనానికి వచ్చానని సదరు రిటైర్డ్ జడ్జి చెప్పారు.
ఆశారాం మాట్లాడుతూ.. భార్గవ తన భక్తుడు అని, ఆయన తనను కలుసుకోవాలని అనుకున్నాడని, అందుకే వచ్చారని, ఆయనకు జ్యూడీషియరీలో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications