ఈ 8 ఫుడ్స్ తింటే డెంగీ జ్వరం రమ్మన్నా రాదు భయ్యా ..
వర్షాకాలం వచ్చిందంటే చాలు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా వైరల్ ఫీవర్ అయితే తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ డెంగీలో అలాకాదు. ఈ వ్యాధిలో సాధారణతో పాటు తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. మరి అవి ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?
డెంగీ ఫీవర్ (జ్వరం) అనేది డెంగీ వైరస్ వల్ల కలిగే ఒక వైరల్ వ్యాధి. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. టైగర్ దోమ పగలు పూట కుట్టినపుడు మాత్రమే డెంగీ జ్వరం వస్తుంది. తొలుత చలి, ఒళ్లు నొప్పులు, కంటి వెనకభాగంలో నొప్పి. నీరసం అధికంగా ఉంటుంది. చర్మంపై దురద వస్తుంది. రెండో దశలో జ్వరం తగ్గిన తర్వాత రెండు రోజులకు తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్లు తగ్గిపోతాయి. ఇది కూడా వైరల్ జ్వరం లాంటిదే.
ఇక డెంగీ వ్యాధిలో మరికొన్ని లక్షణాలను గమనిస్తే.. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, వికారం , వాంతులు ఉంటాయి. దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. విశ్రాంతి తీసుకోవడం.. పుష్కలంగా ద్రవాలు తాగడం.. అలాగే లక్షణాల నుంచి ఉపశమనం పొందడం ద్వారా చికిత్స చేస్తారు.
అయితే మనం తీసుకునే ఆహారం కూడా ప్రస్తుతం విష జ్వరాల నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి జ్వరాలు వచ్చినా శరీరం తట్టుకుంటుందని చెబుతున్నారు. వాటిలో మొదటిది బొప్పాయి పండు.
బొప్పాయి
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాక ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను బొప్పాయి అందిస్తుంది. అలాగే ఇది రక్తపోటును నియంత్రించడంలో, వాపును తగ్గించడంలో, మహిళల ఋతు చక్రంను క్రమబద్ధీకరించడంలో కూడా సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పసుపు
భారతీయులు ప్రతి వంటకంలో పసుపును వినియోగిస్తారు. పసుపు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, క్యాన్సర్ ను నివారించడం వంటి అనేక అనారోగ్య సమస్యలకు పసుపు సంజీవినిగా పనిచేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది.

సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లుగా భావించే నారింజ, నిమ్మ, ద్రాక్ష, జామ పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాక సిట్రస్ పండ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాపును తగ్గించగలవు. వీటిలో ఫైబర్, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఆకు కూరలు
ఆకుకూరలలో విటమిన్ ఎ, సీ, కే, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి వాటిని తగ్గిస్తాయి. ఆకుకూరలు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
బెర్రీలు
బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కణాల నష్టాన్ని నివారిస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి వివిధ రకాల బెర్రీలు పెద్ద ప్రేగు క్యాన్సర్, చిత్త వైకల్యం వంటి వ్యాధుల నివారణలో సహాయపడతాయి. అలాగే బెర్రీలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
నట్స్
నట్స్ గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు, ఎముకల బలానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది. బాదం, పిస్తా, వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్ వంటి వివిధ రకాల నట్స్ వివిధ పోషకాలను అందిస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని కణాల నష్టం నుండి రక్షిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. గుండె, ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే గ్రీన్ టీ బరువు నిర్వహణ, చర్మం వాపు , టైప్ 2 డయాబెటిస్ ప్రమాదానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదు. సాధారణ జలుబు నుండి రక్షిస్తుంది. ఇందులో అల్లిసిన్ అనే సల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పచ్చి వెల్లుల్లి క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్ట, ప్రోస్టేట్, రొమ్ము వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications