ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నట్లే - ఇలా చేయండి..!!
కిడ్నీలు. పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. ఆ వ్యర్ధాలు పూర్తిగా బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవే వ్యర్థాలు కిడ్నీల్లో స్టోన్లుగా మారుతాయి. ఇవి మనకు నొప్పిని, విపరీతమైన ఇబ్బందిని కలగజేస్తాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడే సమయంలోనే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా స్టోన్స్ను ముందే తొలగించుకోవచ్చు. దీంతో పరిస్థితి తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి కిడ్నీలను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వెనుక అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే మూత్రం లో క్యాల్షియం, ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్, సమ్మేళనాలు ఉంటాయి. అయితే నీళ్లను సరైన మోతాదులో తాగితే వీటిని కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కానీ ఇవి కిడ్నీల్లో అధికం గా చేరితే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవి స్టోన్స్గా మారుతాయి. ఎక్కువగా క్యాల్షియం, ఆగ్జలేట్ స్టోన్లు కిడ్నీల్లో ఏర్పడుతాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడుతున్న సమయం లో శరీరం పలు సంకేతాలను తెలియజేస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో తరచూ జ్వరం వస్తుంది. కొద్ది రోజుల పాటు ఉండి తగ్గుతుంది. మళ్లీ కొన్ని రోజులకు వస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే బొడ్డుకు కింది భాగంలో రెండు వైపులా లేదా అదే ప్రాంతంలో వెనుక వైపు కూడా నొప్పి ఉంటుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు లేదా వంగినప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువవుతుంది. ఆ ప్రాంతంలో సూదుల తో పొడిచినట్లు నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో కొందరికి వికారంగా అనిపిస్తుంది.

కొందరికి వాంతులు కూడా అవుతాయి. కొన్ని రకాల పదార్థాల వాసనలు చూస్తే పొట్టలో తిప్పినట్లు అవుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే తల తిరిగినట్లు కూడా అనిపిస్తుంది. స్పృహ తప్పి పడిపోతామమో నని కూడా అనిపిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు మూత్ర విసర్జన చేస్తే మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రంలో నురుగు కూడా కనిపిస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కొందరికి మూత్ర విసర్జన సమయంలో రక్తం కూడా పడుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే నిరంతరాయంగా వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్రే, స్కానింగ్, రక్తం, మూత్రం వంటి పరీక్షల ద్వారా కిడ్నీ స్టోన్లు ఉన్నాయో లేదో నిర్దారిస్తారు. కిడ్నీ స్టోన్లు ఉంటే డాక్టర్లు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుందినిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాలను అధికంగా తింటుంటే కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. తర్బూజా, కీరదోస, పుచ్చకాయలు, ద్రాక్ష పండ్లు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, కివి, అరటి పండ్లు వంటి పండ్లను రోజూ తింటుంటే ప్రయోజనం ఉంటుంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications