86 రోజుల తర్వాత కేదార్నాథ్ గుడిలో పూజలు

ప్రస్తుతం కేదార్నాథ్లో వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో పూజలు ప్రారంభించేందుకు ఆలయ కమిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ తలుపులను 86రోజుల తర్వాత తీశారు. పురోహితుడు రావల్ భీమా శంకర్ లింగ్ శివాచార్య పూజా కార్యక్రమాలను పున:ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
కాగా కేదార్నాథ్ ఆలయంలో పూజా కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, కొందరు మంత్రులతో హాజరవుతున్నట్లు సమాచారం. పూజా కార్యక్రమాలను చిత్రీకరించేందుకు బయల్దేరిన కొందరు మీడియా ప్రతినిధులు వాతావరణం అనుకూలించకపోవడంతో గుప్తకాశీలోనే ఆగిపోయారు.
శుద్ధికరణ్, ప్రయాచిత్తీకరణ్లతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రధాన పురోహితుడితోపాటు కొందరు తీర్థ్ పురోహితులు, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ అధికారులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఆలయ దర్శనకు భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉత్తరాఖండ్లో జూన్లో సంభవించిన భారీ వరదల కారణంగా చాలా మంది భక్తులు మృతిచెందారు. రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, చమోలి, పిత్తోర్గఢ్ జిల్లాల్లో సుమారు 600మంది చనిపోగా 4వేల మంది భక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications