86 రోజుల తర్వాత కేదార్నాథ్ గుడిలో పూజలు

ప్రస్తుతం కేదార్నాథ్లో వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో పూజలు ప్రారంభించేందుకు ఆలయ కమిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ తలుపులను 86రోజుల తర్వాత తీశారు. పురోహితుడు రావల్ భీమా శంకర్ లింగ్ శివాచార్య పూజా కార్యక్రమాలను పున:ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
కాగా కేదార్నాథ్ ఆలయంలో పూజా కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, కొందరు మంత్రులతో హాజరవుతున్నట్లు సమాచారం. పూజా కార్యక్రమాలను చిత్రీకరించేందుకు బయల్దేరిన కొందరు మీడియా ప్రతినిధులు వాతావరణం అనుకూలించకపోవడంతో గుప్తకాశీలోనే ఆగిపోయారు.
శుద్ధికరణ్, ప్రయాచిత్తీకరణ్లతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రధాన పురోహితుడితోపాటు కొందరు తీర్థ్ పురోహితులు, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ అధికారులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఆలయ దర్శనకు భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉత్తరాఖండ్లో జూన్లో సంభవించిన భారీ వరదల కారణంగా చాలా మంది భక్తులు మృతిచెందారు. రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, చమోలి, పిత్తోర్గఢ్ జిల్లాల్లో సుమారు 600మంది చనిపోగా 4వేల మంది భక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications