20 యేళ్ల తర్వాత శుక్ర మహర్ధశ.. వీరి ఇళ్లన్నీ బంగారు మయం
రాక్షసుల గురువైన శుక్రుడు విలాసవంతమైన జీవితానికి, సంపదకు, కళలకు, ఫ్యాషన్లకు కారకుడు. ఆయన జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకుడికి, జాతకురాలికి తిరుగుండదు. నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే క్రమంలో శుక్ర మహర్దశ పట్టబోతోంది. ఇది 20 సంవత్సరాల తర్వాత జరగనుంది. కొన్ని రాశులవారు ఈ మహర్దశ వల్ల కోటీశ్వరులవుతారని పండితులు తెలియజేస్తున్నారు. పట్టిందల్లా బంగారమే అవుతుందని, ఇల్లంతా సంపదలతో నిండిపోతుందని చెబుతున్నారు.
మేష రాశి
ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. ఆర్థికంగా ఈ రాశివారు చాలా బలవంతులుగా మారతాయి. శుక్ర మహర్దశ వల్ల వీరి జీవితం బంగారు మయం కాబోతోంది. ఒకరకంగా సమాజంలో, ఇంట్లో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు వీరి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా తయారవుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది.

తులా రాశి
ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటారు. ఆర్థికంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. పెళ్లికాని వారికి పెళ్లి అవడానికి ఇది మంచి సమయం. సంబంధాలు వస్తాయి. కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి పయనింపచేస్తాయి.
కన్యా రాశి
ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే పూర్వీకుల నుంచికానీ, భార్యవైపు నుంచి కానీ ఆస్తి కలిసివస్తుంది. కొత్తగా వేరే జీవితంలోకి ప్రవేశిస్తారు. సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఎంతో సహనంతో ఉండి పనిలో విజయాన్ని అందుకుంటారు. వృత్తి జీవితంలో ఎదురే ఉండదు. అనుకున్న పనులన్నీ చాలా సులువుగా పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications