వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్‌ అసెంబ్లీపై మళ్ళీ దాడియత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః శ్రీనగర్‌ లో బుధవారం అసెంబ్లీపై దాడికి తీవ్రవాదులు మరో సారి ప్రయత్నించారు. అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్ద గ్రనైడ్‌ పేలిన దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆ తరువాత కొద్దిసేపటికే సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఇలా వరస పేలుళ్ళతో అరగంటపాటు అసెంబ్లీ పరిసరాల్లో భయోత్పాతం సృష్టించారు. ఈ పేలుళ్ళలో తొమ్మిది మంది పోలీసులతో పాటు 30 మంది గాయపడ్డారు. ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు.

బుధవారం మధ్యాహ్నం జహంగీర్‌ చౌక్‌ లో రెండు గ్రనైడ్లు పేలాయి. కాశ్మీర్‌ అసెంబ్లీపై తీవ్రవాదులు దాడిజరిపి సంచనలం సృష్టించి రెండు నెలలు గడవక ముందే మరోసారి దాడికి ప్రయత్నించడం గమనార్హం. ఈ ఘాతుకానికి ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యతను ప్రకటించలేదు. లష్కర్‌, జైషే మహమ్మద్‌ సంస్థలే బాధ్యులై వుంటారని భావిస్తున్నారు. భారత్‌ - పాక్‌ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్న తరుణంలో శ్రీనగర్‌ అసెంబ్లీపై మరో సారి దాడియత్నం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X