వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే ఇంద్రసేన్‌ బంధువు హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఎన్‌. ఇంద్రసేనా రెడ్డి తోడల్లుడుపి. నర్సింహా రెడ్డి (45)ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. నర్సింహా రెడ్డి ఆస్మాన్‌ఘడ్‌లోని తన నివాసానికి వెళ్తుండగా ఈ హత్య జరిగింది.

సైదాబాద్‌ సపోటాబాగ్‌మీదుగా నర్సింహా రెడ్డి కారులో వెళ్తుండగా అటకాయించి కత్తులతో దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. తీవ్ర గాయాలకుగురైన నర్సింహా రెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు కమిషనర్‌ఎం.వి. కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నర్సింహా రెడ్డి ఆంధ్రా బ్యాంక్‌ ఉద్యోగుల సహకార బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శాసనసభ్యుడు ఇంద్రసేనా రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X