వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక ప్యాకేజీకి తెలుగుదేశం డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తెలుగుదేశం సభ్యుడు సి. రామచంద్రయ్య బుధవారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పిస్తుండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని, ఇందుకు కేంద్రం నుంచి తగిన సహాయం అవసరమని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, నక్సల్స్‌కు మధ్య చర్చల ప్రక్రియ ముందుకు సాగుతోందని, ఇది ఒక మలుపు అని ఆయన అన్నారు. ఇదే సందర్భంలోపెద్ద యెత్తున నక్సల్స్‌ లొంగిపోతున్నారని, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోందని, దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిధుల నుంచి కొంత భాగం ఇందుకు గాను రాష్ట్రాలకు కేటాయించడం అవసరమని రామచంద్రయ్య అన్నారు.

నక్సల్స్‌ సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణిస్తున్నామని, నక్సల్స్‌ సమస్యల పరిష్కారానికి ఒక సమన్వయ విభాగం ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పంపితే,సెల్‌ దాన్ని పరిశీలించి, ప్రణాళికా సంఘానికి పంపుతుందని హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర రావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X