వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ బండారం బట్టబయలుః వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః భారత్‌ - పాకిస్తాన్‌ ల మధ్య ఉద్రిక్తతల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవలసిందిగా అమెరికా అధ్యక్షుడు బుష్‌ ఉభయ దేశాధినేతలకువిజ్ఞప్తి చేశారు. ఆల్మటి సదస్సులో కూడా భారత్‌ - పాకిస్తాన్‌ సమస్య ఉపశమించకపోవడంతో ఆయన బుధవారం రాత్రి ఇరుదేశాధినేతలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. యుద్ధం ముప్పు తప్పించేందుకు ఉభయ దేశాలు ప్రయత్నించాలనికోరారు. చర్చలు జరపాలంటూ ఉభయదేశాలకు నొక్కి చెప్పారు. బుష్‌ ఫోన్‌ సంభాషణవివరాలను వైట్‌ హౌస్‌ ప్రతినిధి ఆరీ ఫిషర్‌ వెల్లడించారు.

తీవ్రవాదానికి అన్ని రకాల సాయం నిలిపివేస్తామంటూ ఇచ్చిన మాటను చిత్తశుద్ధితో నిలుపుకోవాలని బుష్‌ ముషారఫ్‌ కు గట్టిగా చెప్పారు. సరిహద్దు నుంచి దళాలను ఉపసంహరించుకొని భారత్‌ కూడా పాక్‌ కు సానుకూలంగా స్పందించాలని బుష్‌కోరారు. భారత్‌ - పాకిస్తాన్‌ ల మధ్య ఉద్రిక్తతల నివారణకు అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ఫీల్డ్‌ బ్రిటన్‌ వెళ్ళి బ్లెయిర్‌ తదితరులతో చర్చలు జరిపారు. ఆయన ఈ నెల 9న భారత్‌ - పాకిస్తాన్‌ లలో పర్యటిస్తారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X