వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై వెంకయ్య ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రస్తుతం గుజరాత్‌లో ఎన్నికలను ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్‌ ఉన్నదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి గుజరాత్‌లో తమ పార్టీ తలపెట్టిన గౌరవయాత్రను కాంగ్రెస్‌ తప్పు పట్టడంపై ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ అంత ఆందోళన ఎందుకు చెందుతోంది? ఎక్కువ కాలం ప్రజల నుంచి దూరంగా వెళ్లిపోలేదు అని ఆయన అన్నారు. గౌరవ యాత్రను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యతిరేకించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చ, సంభాషణ, ప్రచారం తప్పనిసరి అని ఆయనఅంటూ కాంగ్రెస్‌కు మాత్రమే ప్రచారం చేసుకునే హక్కు ఉన్నదా అని ఆయన అడిగారు. గుజరాత్‌ ఎన్నికలవిషయంలో ఎన్నికల కమీషన్‌పై గానీ, గవర్నర్‌పై ఏ విధమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X