వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిట్టిబాబుకు కన్నీటి వీడ్కోలు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంః నక్సలైట్ల చేతిలో హత్యకుగురైన చింతపల్లి కానిస్టేబుల్‌ చిట్టిబాబు శవాన్ని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. ఆయన మృతదేహాన్ని చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలోని ఆయనస్వగృహానికి తరలించారు. గత నెల 24న చిట్టిబాబుతో సహా ఐదుగురు పోలీసులను నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు.మిగిలిన నలుగురిని విడుదల చేసిన నక్సలైట్లు చిట్టిబాబును చంపినట్లు కొద్దిరోజుల తరువాత ప్రకటించారు. ఆయన మృతదేహం గురించి కూడా ఆచూకి తెలియకుండా చేశారు. చివరకు చిట్టిబాబు మృతదేహాన్ని జిమాడుగుల మండలం వలసమామిడి సమీపంలోని అడవిలో పాతిపెట్టినట్లు నక్సలైట్లు వెల్లడించారు.

దీంతో పోలీసులు శనివారం రాత్రి చిట్టిబాబును పాతిపెట్టిన స్థలాన్ని కనుగొన్నారు. ఆయన భౌతిక కాయాన్ని ఆయనస్వగ్రామానికి చేర్చారు. ఆదివారం మధ్యాహ్నం అభిమానులు అశృతర్పణం మధ్య చిట్టిబాబు అంత్యక్రియలు జరిగాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X