వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్ల యాత్ర వాయిదా: చిన జీయర్‌ స్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తిరుమలలోని వేయి కాళ్ల మండపం పునర్నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఆరవ తేదీన తలపెట్టని శాంతి వాహన యాత్రను వాయిదా వేసుకున్నట్లు చిన జీయర్‌ స్వామి చెప్పారు. హైకోర్టు సూచన మేరకు వికాస తరంగణి, వేంకటేశ్వర భక్త మండలి ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

అక్టోబర్‌ ఇరవై తేదీన జరిగిన పాదయాత్రలు విజయవంతం అయినట్లు ఆయన చెప్పారు. వేయి కాళ్ల మండపంనై కోర్టులో వాజ్యం నడుస్తోందని, అందువల్ల నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించిందని ఆయన చెప్పారు. న్యాయస్థానంపై గౌరవంతో కార్యక్రమాన్ని మానుకున్నట్లు ఆయన తెలిపారు. న్యాయస్థానంపై తమకు విశ్వాసం ఉన్నదని ఆయన చెప్పారు. తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X