పెట్రోల్, వంటగ్యాస్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ అర్థరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
పెట్రోల్ ధర లీటర్కు రూపాయి యాబై పైసలు, డీజిల్ ధర రూపాయి పెరుగుతాయి. కిరోసిన్ ధర లీటర్కు యాబై పైసలు పెరిగే అవకాశం ఉంది. వంటగ్యాస్ ధర సిలిండర్కు ఇరవై రూపాయలు పెరుగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో వీటి ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు నెలలుగా పెరగలేదు. వంట గ్యాస్ ధర జూన్ పదిహేనవ తేదీన పెరిగింది. ఆ తర్వాత పెరగలేదు.












Click it and Unblock the Notifications
