బాణసంచాపేలి
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లాలో బాణసంచా పేలిపదకొండు మంది మరణించారు.శ్రీకాకుళం పట్టణంలోని చౌకబజారులో గల పి.సత్యారావు ఇంట్లో గురువారం రాత్రిజరిగిన భారీ విస్ఫోటనం సంబంధించింది. ఈవిస్ఫోటనంలో రెండు భవంతులుకుప్పకూలాయి. శుక్రవారం మరోవిస్ఫోటనం సంభవించింది.
బాణాసంచానురెండు లారీలలో తరలిస్తుండగా ఒక లారీపేలిపోయింది. ఈ సంఘటనలో నలుగురుగాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరిపరిస్థితి ఆందోళనకరంగా ఉంది.శుక్రవారం జరిగిన పేలుడులో కూలిపోయినభవనాలశిథిలాలను తొలగిస్తున్న కొలదీమృతదేహాలు బయటపడుతున్నాయి.పేలుడు సంభవించిన సమయంలో అక్కడపదిహేను మంది కొనుగోలుదారులు ఉన్నట్లుభావిస్తున్నారు.
శుక్రవారంరెండు గోడౌన్లలోని బాణసంచాను రెండులారీల్లో తరలిస్తుండగా ఒక లారీపేలిపోయింది. ఈ సంఘటనలోనిగాయపడినవారు కింగ్జార్జి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకుసంబంధించి ఎమ్మార్వోను, సబ్ఇన్స్పెక్టర్ను ప్రభుత్వం సస్పెండ్చేసింది. పేలుడు సంఘటనలోమరణించివనారి కుటుంబాలకుప్రభుత్వం లక్ష రూపాయలేసిఎక్స్గ్రేషియా ప్రకటించింది. సంఘటనాస్థలాన్ని హోం మంత్రి కె. జానారెడ్డి, మాజీమంత్రి తమ్మినేని సీతారాంతదితరులుసందర్శించారు.