జాబ్వర్క్పేర నిరుద్యోగులకు టోపీ
విశాఖపట్నం:నిరుద్యోగులకు జాబ్ వర్క్ పేరు మీదవిశాఖపట్నంలోని ఒక కంప్యూటర్ కంపెనీ టోపీవేసింది. మూడున్నర కోట్ల రూపాయలకులోక్సంచార్ కామ్ అనే కంపెనీనిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది.
జాబ్వర్క్ ఇప్పిస్తామని, అందుకు ఐదు వేలరూపాయల చొప్పున డిపాజిట్ చేయాలనికంపెనీ నిరుద్యోగులకు చెప్పింది. ఈ డిపాజిట్సొమ్మును ఏడాదిలోగా తిరిగి ఇస్తామని చెప్పింది.దీంతో ఐదేసి వేల రూపాయల చొప్పున ఏడువేల మంది డబ్బులు డిపాజిట్ చేశారు.అయితే ఆ డిపాజిట్ను ఏడాది దాటినా తిరిగిఇవ్వకపోవడంతో అనుమానం చెందిననిరుద్యోగులు మంగళవారం ఆ కంపెనీకార్యాలయాన్ని చుట్టుముట్టారు. పోలీసులకుఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ అధిపతిఅరుణ్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.











Click it and Unblock the Notifications
