హెల్మెట్ధారణ:
హైదరాబాద్:హైదరాబాద్లో హెల్మెట్లు ధరించనిద్విచక్రవాహనదారులకు ఈ నెల 18వతేదీ నుంచి కౌన్సెలింగ్నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రిఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. హెల్మెట్ధరించనివారికి ఈ నెల మూడవ తేదీనుంచి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించినకౌన్సెలింగ్ మంత్రికి, ట్రాఫిక్ పోలీసులకుమధ్య వివాదం తలెత్తడంతో,ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతరావడంతో మధ్యంతరంగాఆగిపోయింది.
హెల్మెట్లపైమార్చి ఏడవ తేదీ వరకు అమ్మకంపన్ను ఉండదని మంత్రి గురువారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.కౌన్సెలింగ్ నుంచి స్త్రీలను, వృద్ధులను,వికలాంగులను మినహాయిస్తున్నట్లుఆయన తెలిపారు. ఈ నెల పందొమ్మిదవతేదీ నుంచి ముప్పయవ తేదీ వరకుఒక ప్రముఖ కంపెనీ హైదరాబాద్లోనిఖైరతాబాద్లో హెల్మెట్ మేళానిర్వహిస్తుందని ఆయన తెలిపారు.హెల్మెట్ ధరించాలనే నిబంధననుఅందరూ పాటించాల్సిందేనని ఆయనచెప్పారు. ఇప్పటి వరకు నలబైశాతం మంది హెల్మెట్లు ధరించారనిఆయన అన్నారు.మెడమీద కత్తి పెడితే తప్పద్విచక్రవాహనదారులు హెల్మెట్లుధరించరని, స్వచ్ఛందంగా ఎవరూహెల్మెట్లు ధరించరని రవాణా శాఖకమీషనర్ గోనెల ఇదే విలేకరులసమావేశంలో అన్నారు.











Click it and Unblock the Notifications
