పరిస్థితిపరిశీలించాకే నక్సల్స్ సభకు అనుమతి:జానా
హైదరాబాద్:శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించాకే ఈనెల పదహారవ తేదీన సిపిఐ(మావోయిస్టు) నక్సల్స్ తలపెట్టినబహిరంగ సభకు అనుమతి ఇస్తామనిహోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు.సభకు అనుమతి కోరుతూమావోయిస్టులు దరఖాస్తు చేసుకుంటేస్థానిక శాంతిభద్రతల పరిస్థితులనుసమీక్షించి నిర్ణయం తీసుకుంటామనిఆయన చెప్పారు. పోలీసు అకాడమీలో జరిగినఒక కార్యక్రమంలో ఆయనగురువారం పాల్గొన్నారు.
మావోయిస్టులబహిరంగ సభపై తనకు ఏవిధమైన సమాచారమూ లేదనిఆయన చెప్పారు. శాంతిభద్రతలపరిస్థితిని సమీక్షించి స్థానిక పోలసులేమావోయిస్టు సభలపై నిర్ణయంతీసుకుంటారని, అయితే ఆ విషయం తమవద్దకు వచ్చినప్పుడు పరిస్థితులనుసమీక్షించి అనుమతి ఇచ్చే విషయంఆలోచిస్తామని ఆయన చెప్పారు.నక్సల్స్కుపెరుగుతున్న ఆదరణకు భయపడేప్రభుత్వం తమ సభలకు అనుమతిఇవ్వడం లేదనే మావోయిస్టుల ప్రతినిధివరవరరావు ప్రకటనకు ఆయనతీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రజల్లోతమకు ఆదరణ ఉండటం వల్లనేప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, తమకుఇంకా ఆదరణ తగ్గలేదని ఆయనఅన్నారు. నక్సల్స్తో రెండో దశచర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
