జయేంద్రఅరెస్టు కక్ష సాధింపు చర్య
కాంచీపురం(తమిళనాడు) : రాజకీయ కక్ష సాధింపుచర్యలో భాగంగానే కంచిశంకరాచార్య జయేంద్ర సరస్వతినిపోలీసులు అరెస్టు చేశారని ఆయన తరఫున్యాయవాది వై. త్యాగరాజన్ అన్నారు.జయేంద్ర సరస్వతిపై చేసిన ఆరోపణలునిరాధారమైనవని ఆయనఅన్నారు.
జయేంద్రసరస్వతికి మెజిస్ట్రేట్ జ్యుడిష్యల్రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసినతర్వాత త్యాగరాజన్ విలేకరులతోమాట్లాడారు. కంచి కామకోటి పీఠానికిహత్యతో ఏ విధమైన సంబంధంలేదని, థర్డ్ పార్టీ కన్ఫెషన్తో ఆఆరోపణలు చేస్తున్నారని, చట్టం ద్వారాతాము న్యాయం పొందుతామని ఆయనఅన్నారు."కొన్నిస్వార్థశక్తులు, రాజకీయ పార్టీలుఆందోళన చేస్తామని బెదిరించాయి.అందుకే జయేంద్ర సరస్వతిని అరెస్టుచేశారు అని ఆయన అన్నారు. ఆందోళనచేస్తామని డియంకె చేసినప్రకటనను ఆయన ఆ విధంగాపరోక్షంగా ప్రస్తావించారు. డెబ్బైయేళ్లున్న జయేంద్ర సరస్వతిఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ అని,అందువల్ల వైద్య చికిత్స కావాలనిజయేంద్ర సరస్వతి మెజిస్ట్రేట్నుకోరారని ఆయన చెప్పారు. ఏ విధమైనవైద్య చికిత్స అందించాలనేది జైలుఅధికారులు నిర్ణయిస్తారని మెజిస్ట్రేట్చెప్పినట్లు ఆయన తెలిపారు.శంకరాచార్యమీడియా ప్రతినిధులతోమాట్లాడలేదు.











Click it and Unblock the Notifications
