వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైలులో జయేంద్ర:బెయిల్పై రేపు నిర్ణయం
చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతిని వేలూరు జైలుకుతరలించారు. ఆయనను వేలూరుజైలులో వెయిటింగ్ రూమ్లోనే ఉంచారు.జయేంద్ర సరస్వతి బెయిల్పిటిషన్పై విచారణను మద్రాసుహైకోర్టు రేపటికి (శనివారానికి)వాయిదా వేసింది. ఆరోగ్యకారణాల రీత్యాఆస్పత్రిలో చికిత్స పొందడానికి జయేంద్రసరస్వతిని అనుమతించాలని ఆయనతరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టుతిరస్కరించింది. ఒక హత్య కేసులో తమిళనాడు పోలీసులుగురువారం రాత్రి జయేంద్ర సరస్వతినిఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్లోఅరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయననునేరుగా హైదరాబాద్ తీసుకొచ్చివిమానంలో చెన్నైకితీసికెళ్లారు.
Comments
Story first published: Friday, November 12, 2004, 23:53 [IST]