కంచిపీఠ బాధ్యతలకు విజయేంద్ర రెడీ
హైదరాబాద్:అవసరమైతే కంచికామకోటిపీఠాధిపతి బాధ్యతలను కంచి మఠంచిన్న శంకరాచార్య విజయేంద్రసరస్వతి స్వీకరించడానికి సిద్ధంగావున్నారని విశాఖపట్నానికి చెందిన శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతిచెప్పారు. ఒక స్థానిక టీవీ చానెల్కు ఇచ్చినఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పినట్లుపిటిఐ వార్తా సంస్థ తెలియజేసింది.
జయేంద్రసరస్వతిపై వచ్చిన ఆరోపణలు రుజువైఅనుకోని పరిస్థితి ఏర్పడితే మాత్రమేవిజయేంద్ర సరస్వతి ఆ బాధ్యతలుస్వీకరిస్తారని ఆయన అన్నారు. జయేంద్రసరస్వతి వారసుడిగా విజయేంద్రసరస్వతిని ఇది వరకే ప్రకటించినట్లుఆయన గుర్తు చేశారు. కంచి మఠంసంరక్షుడిని ఎంపిక చేసుకోవడంలో ఏవిధమైన సమస్య తలెత్తదనిఆయన అన్నారు. జయేంద్ర సరస్వతినినేరస్థుడిగా చూపడం మీడియామానుకోవాలని ఆయన అన్నారు.ఒకయజ్ఞకార్యక్రమం సందర్భంగావిజయేంద్ర సరస్వతి ప్రస్తుతంమహబూబ్నగర్లో ఉన్నారు. ఈకార్యక్రమంలో ఉండగానే జయేంద్రసరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు.











Click it and Unblock the Notifications
