తెలంగాణపైఏకాభిప్రాయం సాధిస్తాం: పియం
హైదరాబాద్:తెలంగాణ ఏర్పాటుపై విస్తృతప్రాతిపదికపై ఏకాభిప్రాయంసాధించగలమనే నమ్మకం ఉన్నదనిప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్అన్నారు. రాజభవన్లో ఆదివారం జరిగినమీడియా సమావేశంలో ఆయనవిలేకరులు అడిగిన ప్రశ్నలకుసమాధానాలు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాఆలూరులో జాతీయ పనికి ఆహారం పథకాన్నిప్రారంభించిన అనంతరం ఆయన ఈమీడియా సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణపైతాము కనీస ఉమ్మడి కార్యక్రమంలో,రాష్ట్రపతి ప్రసంగంలో స్పష్టంగాచెప్పామని, విస్తృత ప్రాతిపదికపైఏకాభిప్రాయం సాధించాలనేది తమఉద్దేశమని, దాన్ని సాధించగలమనేనమ్మకం ఉన్నదని ఆయన అన్నారు.డిసెంబర్లోగా తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతేమంత్రివర్గం నుంచి తప్పుకుంటామనితెలంగాణ రాష్ట్ర సమితి చేసినప్రకటనపై అంతకు మించి ఆయనప్రతిస్పందించలేదు.రెండోరాష్ట్రాల పునర్విభజన కమీషన్ (రెండోఎస్సార్సీ) ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అడిగితేవిస్తృత ప్రాతిపదికపై అన్ని పార్టీలఏకాభిప్రాయం సాధించాల్సి ఉన్నదని, ఆఏకాభిప్రాయాన్ని అమలు చేస్తామని, రెండోఎస్సార్సీ గురించి ఎన్నికల ప్రణాళికలో చెప్పామని,ఏదైనా ఏకాభిప్రాయ సాధనతర్వాతనేనని ఆయన అన్నారు.పెట్రోల్,డీజిల్ ధరలు పెంచక తప్పని అనివార్యపరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలోవామపక్షాలను ఒప్పించే మార్గాలనుఆలోచిస్తామని ఆయన చెప్పారు. ధరలుపెంచకపోతే ప్రభుత్వ రంగంలోనిఆయిల్ కంపెనీలు నష్టాలకు గురైఅభివృద్ధి కార్యక్రమాలు దెబ్బ తింటాయనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
