చర్చలువిరమిస్తే గుణపాఠం: మావోయిస్టు నేత
హైదరాబాద్:చర్చలు మానుకుంటే ప్రజలే కాంగ్రెస్ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారనిసిపిఐ (మావోయిస్టు) నాయకుడు జంపన్నహెచ్చరించారు. చర్చలు విరమించుకుంటేశాంతి భద్రతలకు విఘాతంకలుగుతుందని ఆయన అన్నారు. మీడియాప్రతినిధులతో ఆయన అటవీ ప్రాంతంలోని ఒకరహస్య ప్రదేశంలో మాట్లాడారు.
చరన్చనీయాంశంఆయుధాలు కాదని, ప్రజాసమస్యలేననిఆయన అన్నారు. చర్చలపై తన వైఖరినిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి సూటిగా చెప్పాలని ఆయనడిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డిప్రభుత్వం భూస్వాములకు,పెట్టుబడిదారీలకు కొమ్ము కాస్తోందని ఆయనఅన్నారు. ప్రభుత్వం చర్చలపైచిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని,చర్చలను మానుకుంటే తమకార్యక్రమాలపై పునరాలోచనచేస్తామని ఆయన చెప్పారు. సభలకు,సమావేశాలకు అనుమతి ఇవ్వకుండాప్రభుత్వం అప్రకటిత నిషేధాన్ని అమలుచేస్తోందని ఆయనవిమర్శించారు.ప్రత్యేకతెలంగాణకు తమ పార్టీ నాయకత్వంవహిస్తుందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు, ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్కె. కేశవరావు ఇద్దరూ తెలంగాణద్రోహులేనని ఆయన విమర్శించారు.పదవుల కోసమే వారు తెలంగాణఉద్యమాన్ని భుజాన వేసుకున్నారనిఆయన అన్నారు. పులిచింతల వంటిప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వంతెలంగాణకు అన్యాయం చేస్తోందనిఆయన విమర్శించారు. పులిచింతలప్రాజెక్టును తాము అడ్డుకుంటామనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
