వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనేపెద్ద అవినీతిపరుడు బాబు: కెకె

By Staff
|
Google Oneindia TeluguNews

కాంచీపురం:జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతిని ఈ నెల 18వతేదీ లోగా తమ ముందు హాజరుపరచాల్సిందిగా స్థానిక కోర్టు పోలీసులనుఆదేశించింది. హత్య కేసులో అరెస్టయినజయేంద్ర సరస్వతి ప్రస్తుతం వెల్లూరుజైలులో ఉన్న విషయం తెలిసిందే.

జయేంద్రసరస్వతిని తమకు అప్పగించాలని కోరుతూపోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణసందర్భంగా కాంచీపురం ఫస్టు క్లాస్‌మెజిస్ట్రేట్‌ మంగళవారం ఆ ఆదేశాలు జారీచేశారు. కేసును మెజిస్ట్రేట్‌పద్దెనిమిదవ తేదీకి వాయిదావేశారు.పోలీసుకస్టడీకి అభ్యంతరం తెలియజేస్తూపిటిషన్‌ దాఖలు చేయడానికి తనకుఅనుమతి ఇవ్వవలసిందిగా అంతకుముందు జయేంద్ర సరస్వతి తరఫున్యాయవాది వై. త్యాగరాజన్‌ కోర్టునుకోరారు. జ్యుడిష్యల్‌ కస్టడీలో ఉన్నసందర్భంగా తనకు కొన్ని ప్రత్యేకసదుపాయాలు కల్పించాలని కోరుతూజయేంద్ర సరస్వతి పెట్టుకున్నపిటిషన్‌పై విచారణను కూడా మెజిస్ట్రేట్‌పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేశారు.ఆస్పత్రి సౌకర్యాలు, పూజా నిర్వహణకుఅనుమతి, సొంతగా వంట చేసుకునేఅవకాశం కల్పించాలని కోరుతూ జయేంద్రసరస్వతి పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు.కొన్నిపత్రాలను తమకు ఇవ్వాలని కోరుతూజయేంద్ర సరస్వతి తరఫు న్యాయవాదిపెట్టుకున్న పిటిషన్‌కు వ్యతిరేకంగాపబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. జయేంద్రసరస్వతి బెయిల్‌ పిటిషన్‌పైమద్రాసు హైకోర్టులో వాదించేందుకుతనకు ఎఫ్‌. ఐ. ఆర్‌., రిమాండ్‌ రిపోర్టుఇప్పించవలసిందిగా త్యాగరాజన్‌కోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X