అరెస్టు కలచివేసింది: విజయేంద్ర సరస్వతి
కాంచీపురం:జయేంద్ర సరస్వతి అరెస్టు తననుతీవ్ర ఆవేదనకు గురి చేసిందని కంచికామకోటి ఉత్తరాధిపతి విజయేంద్రసరస్వతి అన్నారు. ఆయన ఎట్టకేలకుతన మౌనాన్ని వీడారు. ఆయనమంగళవారం ఉదయానికి కాంచీపురంచేరుకున్నారు.
పోలీసులభద్రతతో విజయేంద్ర సరస్వతిఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్నుంచి రోడ్డు మార్గాన సోమవారంబయలుదేరి మంగళవారం ఉదయానికిఇక్కడకి చేరుకున్నారు.భగవంతుడిని ప్రార్థించవలసిందిగాతాను భక్తులందరికీ సూచిస్తున్నాననిఆయన అన్నారు. ఈ సమయంలో మాజీప్రధాన ఎన్నికల కమీషనర్ టి. యన్.శేషన్ మఠంలో ఉన్నారు.మహబూబ్నగర్సమీపంలో విజయేంద్ర సరస్వతి బసచేసిన సూర్యలక్ష్మి కాటన్ మిల్లులోసోమవారం రహస్య మంతనాలుజరిగాయి. రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్యస్యస్) అధికార ప్రతినిధిరామ్ మాధవ్తో పాటు పలువురువిజయేంద్ర సరస్వతితో మంతనాలుజరిపారు. ఈ మంతనాల అనంతరంవిజయేంద్ర సరస్వతి హడావిడిగాకాంచీపురం బయలుదేరి వచ్చారు.ఇదిలావుండగా కంచి మఠంలో పోలీసులుసోమవారం సోదాలు నిర్వహించారు. కంచికామకోటి శంకర మఠం మేనేజర్సుందరేశన్ అయ్యర్ను, అకౌంటెంట్నీలకంఠ్ను పోలీసులు అరెస్టుచేశారు.











Click it and Unblock the Notifications
