పులిచింతలసాధించి తీరుతాం: నెహ్రూ
విజయవాడ:పులిచింతల ప్రాజెక్టును సాధించితీరుతామని కాంగ్రెస్ శాసనసభ్యుడుదేవినేని నెహ్రూ అన్నారు. పులిచింతలప్రాజెక్టు పనులను ఆపేయాలని హైకోర్టుఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయనబుధవారం ఆ విధంగాప్రతిస్పందించారు.
పులిచింతలపైహైకోర్టు తీర్పు నేపథ్యంలో తలెత్తినపరిస్థితిపై చర్చించడానికి కృష్ణా డెల్టానాయకులు గురువారం విజయవాడలోసమావేశమవుతున్నారు. కాంగ్రెస్శాసనసభ్యులు దేవినేని నెహ్రూ,మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశంనాయకుడు యలమంచలి శివాజీతదితరులు ఈ సమావేశంలోపాల్గొంటారు.పులిచింతలప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిలభించేలా కేంద్రంపై ఒత్తిడి తెవాలనితాము ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డిని కోరుతామని నెహ్రూచెప్పారు. ముందు వైయస్తో చర్చించిప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోతెలుసుకుంటామని ఆయన చెప్పారు. చాలాప్రాజెక్టుల నిర్మాణం అనుమతులులేకుండానే జరిగాయని, ఇది కూడా అలాగేజరుగుతుందని అనుకున్నామని ఆయనఅన్నారు. అయితే వైయస్ నీటి పారుదలప్రాజెక్టులు చేపడుతూ ముందడుగువేస్తుంటే సహించలేక కోర్టు ద్వారాఅడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయనవ్యాఖ్యానించారు.











Click it and Unblock the Notifications
