జయేంద్రబెయిల్ పిటిషన్పై విచారణ రేపుకూడా
చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి బెయిల్ పిటిషన్పై విచారణగురువారంనాడు కూడా కొనసాగుతుంది.బుధవారం ఉదయం పదకొండుగంటలకు మద్రాసు హైకోర్టులో జయేంద్రసరస్వతి బెయిల్ పిటిషన్పై విచారణప్రారంభం కావాల్సింది. అయితేమధ్యాహ్నం రెండున్నర గంటలకువిచారణ ప్రారంభమైంది.
జయేంద్రసరస్వతి తరఫున ప్రముఖ న్యాయవాదిరాం జెఠ్మలానీ హైకోర్టులో వాదించారు.ఆయన వాదన బుధవారంనాడు పూర్తికాలేదు. దీంతో విచారణగురువారంనాడు కూడా జరుగుతుంది.జయేంద్ర సరస్వతి అరెస్టులో పోలీసులుమానవ హక్కులను ఉల్లంఘించారని రాంజెఠ్మలానీ వాదించారు.
జయేంద్ర సరస్వతి బెయిల్పిటిషన్పై బుధవారం మధ్యాహ్నంకోర్టు తన నిర్ణయాన్నిప్రకటించనుంది. స్వామి జైలు వెలుపలికివచ్చి పూజలు చేసుకునే అవకాశం ఇవ్వాలనిఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇలా ఉండగా చిన్నస్వామి విజయేంద్ర సరస్వతి తమ్ముడు రఘుఅన్నగారు ఆశ్రమంలో అడుగుపెట్టగానేఅక్కడ ప్రత్యక్షమయ్యాడు. పోలీసుకస్టడీలో ఉన్నట్టు భావిస్తున్న రఘుఆశ్రమంలోకి ఎలా వచ్చాడు,ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడన్న విషయం మిస్టరీగా ఉంది.












Click it and Unblock the Notifications
