నాపైతప్పుడు కేసు: కోర్టులో జయేంద్ర
చెన్నై:పోలీసు కస్టడీలోకి వెళ్లడానికిశంకరరామన్ హత్య కేసులోనిందితుడైన కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి నిరాకరించారు.తనకు మధుమేహ వ్యాధిఉన్నందున పోలీసు కస్టడీలో ఉండడంసాధ్యం కాదని జయేంద్ర సరస్వతివాదించారు. తనపై తప్పుడు కేసుబనాయించారని ఆయన ఆరోపించారు.
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి గురువారం మధ్యాహ్నంకాంచీపురం కోర్టులో హాజరయ్యారు.వాంగ్మూలంపై సంతకం చేయడానికికూడా ఆయన నిరాకరించారు. అది తప్పదనిన్యాయమూర్తి చెప్పడంతో వేలి ముద్రవేశారు. జయేంద్ర సరస్వతిపైపోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశంఉన్నందున పోలీసు కస్టడీకిఅప్పగించవద్దని జయేంద్ర సరస్వతితరఫు న్యాయవాది అన్నారు. జయేంద్రనుఐదు రోజులు కస్టడీలోకి తీసుకోడానికి అనుమతి ఇవ్వవలసిందిగాపోలీసులు న్యాయస్ధానాన్ని కోరారు. ఇలాఉండగా సీనియర్ పీఠాధిపతి జయేంద్రసరస్వతిని రోజూ కలవడానికి తనకుఅనుమతి ఇవ్వవలసిందిగా జూనియర్ స్వామివిజయేంద్ర సరస్వతి కోర్టును లిఖితపూర్వకంగా కోరినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
