పోలీసుకస్టడీపై మద్రాసు హైకోర్టు విచారణ
చెన్నై:కంచ కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతికి పోలీసు కస్టడీ విధిస్తూ జారీఅయిన కాంచీపురం మెజిస్ట్రేట్ ఆదేశాలనుసవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులోపిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పైవిచారణను మద్రాసు హైకోర్టుశుక్రవారం చేపడుతుంది.
జయేంద్రసరస్వతిని మూడు రోజుల పాటు పోలీసుకస్టడీకి రిమాండ్ చేస్తూ కాంచీపురంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు డైరీ,ఇతర పత్రాలను పరిశీలించిన తర్వాతపోలీసు కస్టడీకి రిమాండ్ చేయడానికితగిన పరిస్థితి ఉన్నదని కోర్టుభావించిందని, దర్యాప్తు ముందుకుసాగడానికి అది న్యాయమైనది,అవసరమైనదని ఫస్టు క్లాస్జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ జి. ఉత్తమరాజాఅన్నారు.
తానుకోరిన న్యాయవాదులను జయేంద్రసరస్వతి ప్రతి రోజు సాయంత్రం ఆరునుంచి ఏడు గంటల మధ్యకలుసుకోవచ్చునని, ప్రతి రోజూ కంచి స్వామిఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్యులుపరిశీలిస్తారని ఆయన చెప్పారు.తంజావూరు బార్ అసోసియేషన్సభ్యుడు, న్యాయవాది వి. కృష్ణస్వామిజయేంద్ర సరస్వతిని కలుసుకోవడానికిఅవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications
