వాటా తేలాకేసాగునీటి ప్రాజెక్టులు : సిపిఐ
హైదరాబాద్:నదీ జలాల వాటా ప్రాంతాలవారీగా తేలిన తర్వాతనేరాష్ట్రంలో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలనిభారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ)ప్రభుత్వాన్ని కోరింది. పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్ణయాలనుసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, నల్లగొండలోక్సభ సభ్యుడు సురవరంసుధాకర్ రెడ్డి సోమవారంవిలేకరుల సమావేశంలోవెల్లడించారు.
కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుకన్నా ముందు టెయిల్ పాండ్ నిర్మాణాన్నిపూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపైచర్చకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంవిషయంలో దుర్భిక్ష ప్రాంతాలకుప్రాధాన్యం ఇవ్వాలని ఆయనఅభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులనిర్మాణం ప్రాంతీయ అసమానతలనుతొలగించే విధంగా ఉండాలని, తాముఅన్యాయానికి గురవుతున్నామనేవెనకబడిన ప్రాంతాల ప్రజలమనోభావాలను మార్చే విధంగా ఉండాలనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
