కాన్పూర్టెస్టు: రాణించిన భారత ఓపెనర్లు
హైదరాబాద్:రైతుల సంక్షేమానికి తాముచేపడుతున్న పనులకుతెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గతతెలుగుదేశం ప్రభుత్వ విధానాలవల్లనే ఇప్పటికీ రైతులఆత్మహత్యలు కొనసాగడానికికారణమని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు.
గతపదేళ్ల సమస్యల వల్లనే రైతులఆత్మహత్యలు ఇప్పటికీ అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు.రైతుల ఆత్మహత్యలపైన్యాయవిచారణకు ఆదేశించినందున దీనిపైఎక్కువ లోతుగా చర్చించడానికి వీలు కాదనిఆయన అన్నారు. తాము చేసిన ఒక్క పనివల్లనైనా రైతులు నష్టపోయారనిచెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపూర్తయితే, రైతులకు మేలు జరిగితే ఓట్లురావాలనే భయంతో తెలుగుదేశం పార్టీఆ పనులకు అడ్డుపడుతోందని ఆయనఅన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులటెండర్లపై కోర్టుకు వెళ్లిందితెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన వ్యక్తియేనని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications
