కరీంనగర్కాల్పుల వివరాలు అందలేదు: వైయస్
హైదరాబాద్/మహబూబ్నగర్: కరీంనగర్జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుకమ్యూనిస్టులకు మధ్య జరిగినఎదురుకాల్పులపై ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆచితూచిస్పందించారు. ఆ సంఘటనకు సంబంధించినవివరాలు తనకు ఇంకా తెలియవనిఆయన గురువారం సాయంత్రంసచివాలయంలో విలేకరులతో అన్నారు.
వివరాలుతెలియకుండా మాట్లాడటం సరి కాదని,వివరాల కోసం వేచి చూస్తున్నామని ఆయనఅన్నారు. విలేకరులు పదే పదే అడగ్గావివరాలు తెలియకుండా ఏంమాట్లాడుతాం, మీకెంత తెలుసోనాకంతే తెలుసు అని ఆయన అన్నారు. మహబూబ్నగర్జిల్లా కొల్లాపూర్ మండలంమల్లేశ్వరం గ్రామంలోవెంకటేశ్వర్లుపై నక్సలైట్లు కాల్పులుజరిపిన సంఘటనదురదృష్టకరమైందనిమహబూబ్నగర్ పోలీసుసూపరింటిండెంట్ విక్రం సిరోమాన్అన్నారు. దాడికి సంబంధించి కేసునమోదు చేశామని, చట్టపరమైనచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్యచర్చలు జరుగుతున్న తరుణంలోఇటువంటి సంఘటన చోటు చేసుకోవడందురదృష్టకరమని ఆయనఅన్నారు.మల్లేశ్వరంగ్రామంలో బుధవారం రాత్రి మావోయిస్టునక్సలైట్లు సభ నిర్వహించారు. ఈసమయంలో వెంకటేశ్వర్లు ఆ సభవద్దకు వెళ్లాడు. గతంలోనక్సలైట్లు వెంకటేశ్వర్లు తండ్రినిహత్య చేశారు. తమ తండ్రినిఎందుకు చంపారని వెంకటేశ్వర్లునక్సల్స్ను అడిగాడు. ఈ సమయంలోమరికొంత మంది కూడా నక్సల్స్తోవాదనకు దిగారు. దీంతో నక్సల్స్వెంకటేశ్వర్లుపై మూడు రౌండ్లుకాల్పులు జరిపారు. అతని పరిస్థితిఆందోళనకరంగా ఉంది. హైదరాబద్లోనినిమ్స్లో చికిత్స పొందుతున్నాడు.











Click it and Unblock the Notifications
