రాజకీయాలపై బాలయ్య భాషణ
తనను కలిసిన విలేఖరులతో బాలకృష్ణ మాట్లాడు తూ రాజకీయాలపై ఇప్పుడే స్పందించడం సరికాదన్నారు. ప్రసవానికి తొమ్మిది నెలల సమయం పడుతుందని, చూస్తుంటే మీరు (విలేఖరులు) మధ్యలోనే అబార్షన్ చేసేటట్టున్నారని చలోక్తి విసిరారు. తమకు ఇంకా కొంత సమయం కావాలన్నారు. అన్ని విషయాల గురించి ఎన్నికల ప్రచారంలో వివరిస్తానని చె ప్పారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఎంవివిఎస్మూర్తి షూటింగ్ విరామ సమయంలో బాలకృష్ణతో కాసేపు మాట్లాడారు.
అలాగే స్థానిక తెలుగుదేశం నాయకుడు జొన్నలగడ్డ చౌదరి, పివి రామారావు, బర్ల శ్రీనివాస్, పి.శ్రీనివాస్ తదితరులు బాలకృష్ణను కలిసి మండలంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడానికి వీలైన తేదీలు చెప్ప మని కోరారు. అయితే తాను ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ విషయం పరిశీలిస్తానని బాలకృష్ణ వారికి చెప్పారు. కొవ్వూరు ఎ మ్మెల్యే కృష్ణబాబు గురించి స్థానిక నా యకులను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం షూటింగ్లో బిజీ అయ్యారు. మ ధ్యాహ్నం నుంచి రాజమండ్రి మేయర్ వీరరాఘవమ్మ, స్థానిక అభిమానులు బాలకృష్ణను కలిశారు. వారితో ఆయన ఉత్సాహంగా కలి సి ఫొటోలకు పోజులిచ్చారు.