ఇక ఖమ్మం ఎజెన్సీలో పవన్
ఆ తర్వాత పోలవరం ముంపుగ్రామాల ప్రజలతో మాట్లాడతారు. అనంతరం భద్రాచలంలో బహిరంగసభలో పాల్గొంటారు. మర్నాడు ఉదయం భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. మణుగూరులో రోడ్ షో నిర్వహించి పాల్వంచలో బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడవరోజు తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు సొంతగ్రామంలో ఆయన పర్యటిస్తారు. అనంతరం రామవరం వద్ద మదర్థెరిస్సా, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొని రాత్రికి అక్కడే బసచేసి 22 ఉదయం హైదరాబాద్ వెళతారు.
Story first published: Tuesday, February 17, 2009, 14:46 [IST]