వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం కు కేశవరావు కితాబు
హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కేశవరావు అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యునిగా నియమితులైన తర్వాత హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, సోనియాగాంధీ తెలంగాణ సహా అన్ని విషయాల్లో సానుకూలంగా ఉన్నారన్న కేకే పత్రి పక్షాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ కమిటీకి చట్టబద్ధత ఉండదని ప్రకటనకు సంబంధించి ఏమైనా ఉంటే పార్టీలో చర్చిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని ఆయన తెలిపారు
Comments
Story first published: Sunday, February 22, 2009, 16:36 [IST]