టిడిపికి సిపిఎం అల్టిమేటం
హైదరాబాద్: సీట్ల సర్దుబాటుపై సిపిఎం తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. తమకు బలం ఉన్న అన్ని స్థానాల్లో తాము పోటీ చేసి తీరుతామని సిపిఎం నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుపై తలెత్తిన సమస్యపై చర్చించడానికి ఆదివారంనాడు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. వైరా, మంగళగిరి, పటాన్ చెరు, వరంగల్ (తూర్పు) శాసనసభా స్థానాలు తమకు ఇవ్వాల్సిందేనని సిపిఎం నాయకులు పట్టుబడుతున్నారు. ఈ స్థానాల్లో తాము నామినేషన్లు వేస్తామని, తెలుగుదేశం చొరవ చూపి సర్దుబాటు చేయకపోతే తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని సిపిఎం నాయకుడు వెంకటేశ్వరరావు అన్నారు.
సీట్ల సర్దుబాటులో గందరగోళానికి తెలుగుదేశం పార్టీయే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇదిలా వుంటే, సిపిఎం నాయకులను బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రాయబారం నెరుపుతున్నారు. 15 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లతో సర్దుకోవాలని ఆయన సిపిఎం నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
-
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications