చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పార్టీవన్నీ కలలే: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
చెన్నై: చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తామని ఎక్కువ కలలు కన్నదని, అవన్నీ కలలే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా అన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గల్లా అరుణకుమారిపై ఓడిపోయిన రోజా చెన్నై చేరుకున్నారు. ఐదేళ్లు తాను ప్రజల మధ్య ఉన్నానని, ప్రజలకు సేవ చేశానని ఆమె ఒక టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తనను ప్రజలు ఓడించలేదని, మిగతా పార్టీలన్నీ కలిసి ఓడించాయని ఆమె అన్నారు. తాను ప్రజల మధ్యనే ఉంటానని ఆమె చెప్పారు.

తమ పార్టీ ఓటమికి ప్రజారాజ్యం పార్టీయే కారణమని, ప్రజారాజ్యం వల్ల తాము 92 స్థానాల్లో ఓడిపోయామని ఆమె చెప్పారు. నామినేటెడ్ పదవులపై తనకు నమ్మకం లేదని, తాను ప్రజల మధ్యనే ఉంటానని, దాని ద్వారానే ప్రజాభిమానం పొందగలుగుతానని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X