టెక్కలి ఎమ్మెల్యే మృతి
శ్రీకాకుళం: టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవతీపతి గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు రోజులుగా ఆయన విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారడంతో మధ్యాహ్నం చనిపోయారు. రేవతీపతి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆర్థిక మంత్రి రోశయ్యలు సంతాపం ప్రకటించారు. విశాఖలోని కేర్ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకపోయింది.
congress కాంగ్రెస్ vishakapatnam వైఎస్ care hospital rosaiah రోశయ్య srikakulam శ్రీకాకుళం tekkali రేవతీపతి
Story first published: Tuesday, June 2, 2009, 15:47 [IST]