బాంబుపేలుళ్ళలో 8 మంది మృతి
పాకిస్థాన్: డేరాఇస్మాయిల్ఖాన్ నగరంలోని పీర్బజారులో బాంబుపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందారు. 25మంది వరకు గాయపడ్డారు. ఒక వాహనంలో బాంబును అమర్చి దుండగులు పేలుడుకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయపడిన వారిని జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయబృందాలు, భద్రతాదళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యల్లో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications